28 సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు.. గగ్గోలు పెడుతున్న జనం

-

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత యాభై రోజుల్లో మరీ విపరీతంగా పెరిగిపోయాయి. మొత్తం 28 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మే 4 తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 7 రూపాయలకు పైగా రేటు పెరిగింది. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తమపై పెట్రో బాంబు మరింత కష్టాల్లోకి నెట్టిందంటున్నారు. పెట్రో ధరల పెంపుతో అటు నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 101.33గా ఉంది. డీజిల్ ధర రూ. 96.17గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక జైపూర్ లో అత్యధికంగా ధరలు ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 104.17 కాగా డీజిల్ రూ. 97.27గా కొనసాగుతోంది. ముంబై‌లో ఈ రోజు పెట్రోల్ లీటర్ రూ. 103.63గా ఉంది. డీజిల్ రూ. 95.72గా అమ్ముతున్నారు. ఢిల్లీలో పెట్రోల్ రూ. 97.50 కాగా డీజిల్ రూ. 88. 23గా ఉంది. కోలకతలో పెట్రోల్ రూ. 97.38 కాగా డీజిల్ రూ. 91.08గా కొనసాగుతోంది. చెన్నైలో పెట్రోల్ లీటర్ 98 రూపాయల 65 పైసలు కాగా డీజిల్ రూ. 92.83గా ఉంది. లక్నోలో రూ. 94.70గా ఉండగా డీజిల్ లీటర్ రూ. 88.65గా వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news