ఫోటో వైరల్: హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో అమితాబ్ బచ్చన్ సందడి

-

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన తదుపరి చిత్రం షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో సందడి చేశారు. ట్రైన్ సీక్వెన్స్ చిత్రీకరణలో భాగంగా స్టేషన్‌కు వచ్చిన ఆయనను చూడటానికి చాలా మంది ప్రయాణికులు వచ్చారు. అయితే ప్రస్తుతం అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో మెట్రో స్టేషన్ మొత్తం ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తోంది. కెమెరా మెన్స్, చిత్రబృందం ఉన్నారు.

అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కే’ కోసం పని చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news