ఈనెల 19న సికింద్రాబాద్‌లో ప్రధాని మోదీ సభ

-

ప్రధాని మోదీ ఈ నెల 19న హైదరాబాద్‌ రానున్నారు. ఉదయం 10 నుంచి వరుస కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఐదు ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు. మూడు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇస్తారు. అనంతరంసికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటనలో రూ.7 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూమిపూజ చేయడంతోపాటు జాతికి అంకితం చేస్తారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

ప్రధాని రాక దృష్ట్టా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఏర్పాట్లపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్, డీఆర్‌ఎం ఏకే గుప్తాతో చర్చించారు. అనంతరం సికింద్రాబాద్‌ జింఖానాగ్రౌండ్స్‌ను సందర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో సంజయ్, లక్ష్మణ్‌ సమావేశమై ప్రధానికి ఘనస్వాగతం, సభ విజయవంతం అంశాలపై చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news