అర్బన్ నక్సల్స్ తో జాగ్రత్త: ప్రధాని మోడీ

-

అర్బన్ నక్సల్స్ తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొత్త వేశంలో గుజరాత్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం గుజరాత్‌లోని భారుచ్ జిల్లాలో దేశంలోని తొలి బల్క్ డ్రగ్ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రధాని మోడీ
ప్రధాని మోడీ

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘గుజరాత్ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అర్బన్ నక్సల్స్ కుట్ర చేస్తున్నారు. డిఫరెంట్ లుక్‌తో రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారు. యువతను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు భారత్ ప్రపంచ ఆర్థిక ర్యాంకుల్లో 10వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news