BREAKING NEWS: హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ… ఇక్రిశాట్ కు బయలుదేరిన పీఎం.

-

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు ప్రత్యేకం విమానంలో చేరుకున్న పీఎంకు రాష్ట్ర గవర్నర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్, డీజీపీలు సాదర స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా పటాన్ చెరులోని ఇక్రశాట్ చేరుకోనునన్నారు ప్రధాని మోదీ.

హైదరాబాద్ లోని ఇక్రిశాట్ లో స్వర్ణోత్సవాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ముచ్చింతల్ లోని సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. దాదాపు 5 గంటల పాటు హైదరాబాద్ లో ప్రధాని పర్యటన సాగనుంది. ముందుగా అనుకున్న ప్రకారంర శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం ప్రధానిని రిసుకోవాల్సి ఉన్నా.. స్వల్ప అస్వస్థత కారణంగా ఈకార్యక్రమానికి దూరం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news