స్వాతి నాయుడు, ఉప్పల్ బాలు పై పోలీస్ కేసు

-

ఈమధ్య సోషల్ మీడియాల పుణ్యమా అని అతి తక్కువ సమయంలోనే వెలుగులోకి వచ్చి పాపులరైన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరికి తోచిన స్టైల్లో వారు పబ్లిసిటీ కోసం రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇలా తక్కువ సమయంలో వెలుగులొకి వచ్చిన వాళ్ళలో ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు కూడా ఉన్నారు. అయితే తాజాగా వీరి పై హైదరాబాద్ కు చెందిన యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అశ్లీల, ప్రాంక్ వీడియో ల పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇందులో భాగంగానే ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు,7 ఆర్ట్స్ శ్రీకాంత్ రెడ్డి, ప్రాంక్ పోరీలు-దివ్య వంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా అశ్లీల వీడియోలను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా అయినా ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ వాటిలో పోస్ట్ చేయడం వల్ల వాటిని చూసి చిన్న పిల్లలు చెడిపోతున్నారని ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆ యువకుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news