చిక్కుల్లో రైటర్ అనంత శ్రీరామ్.. పోలీసులకు ఫిర్యాదు

-

ఈ మధ్య టాలీవుడ్‌ పరిశ్రమలోని సినిమాలు, పాటలపై వివాదాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు కాక.. ఇంకేప్పుడు అనే సినిమా ఇటీవల పెద్ద రచ్చ జరిగిన సంఘటన మరువకముందే.. తాజాగా.. మరో వివాదం తెరపైకి వచ్చింది. దేవుడిని కించపరిచేలా పాటను రచించారంటూ ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ పై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నాగశౌర్య హీరోగా నటిస్తోన్న వరుడు కావలెను సినిమాలోని ఒక పాటలో నాగదేవతను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్‌ రచన ఉందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతర శ్రీరామ్‌ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూరెడ్డి ఆరోపిస్తున్నారు. నాగ దేవతను కించ పరిచే విధంగా పాటను రచించిన అనంత శ్రీరామ్‌ పై అలాగే సినిమా బృందం పై చర్యలు తీసుకోవాలని బిందూ రెడ్డి నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. కాగా.. ఇటీవలే.. వరుడు కావలెను సినిమా నుంచి “దిగు దిగు దిగు నాగ” అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news