ట్విటర్ ఇండియా చీఫ్‌పై మరో రెండు కేసులు

-

న్యూఢిల్లీ: ట్విటర్ ఇండియా చీఫ్‌పై తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే ఆయనపై గత వారం యూపీలో ఓ కేసు నమోదు అయింది. వృద్ధుడిపై ఓ యుస్లిం యువకుడి దాడి ఘటనకు సంబంధించి విద్వే షాలు రెచ్చగొట్టేలా కొందరు ట్విటర్‌ను ఉపయోగించారని ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి ఘజియాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇప్పుడు తాజాగా మరో వివాదం తెలెత్తింది. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ను ప్రత్యేక దేశంగా చూపించారని, ఇది ఉద్దేశ పూర్వకమని, రాజద్రోహం కింద కేసులు నమోదు చేయాలని ప్రవీణ్ భాటి అనే భజరంగ్ దళ్ నేత యూపీలోని బులందర్ పహారా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 505(2), ఐటీ సవరణ చట్టం 2008లోని సెక్షన్‌ 74 కింద ఎఫైఆర్ నమోదు చేశారు. వారంలో వివరణ ఇవ్వాలని మనీష్‌కు ఆదేశించారు.

అయితే మనీష్‌పై గతవారం నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. యూపీ పోలీసుల నోటీసులపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు మనీష్‌పై చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఇప్పుడు నమోదైన రెండు కేసుల్లో మనీష్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news