జగన్ పై దాడికేసులో పోలీసుల అదుపులో మరొకరు..!

-

సీఎం జగన్ మీద దాడి కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. స్థానికులు మొబైల్స్ తో తీసిన వీడియో ఆధారంగా ఐదుగురుని నిన్న గుర్తించారు. అయితే ఇప్పుడు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే సీఎం జగన్ మీద దాడి కేసులో పోలీసులు ఇంకొకరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులో దుర్గారావు అనే యువకుడు వున్నాడు.

దుర్గారావు సతీష్ కలిసి దాడి చేశారని పోలీసుల అనుమానం. నిన్న ఒకరిని నిందితుడని భావించారు. ఐదుగురు యువకుల్ని దాడి చేయడానికి గల కారణం పై విచారించినట్లు తెలిపారు టైల్స్ రాయి ముక్కతో జగన్ మీద దాడి చేసినట్లు గుర్తించారు పోలీసులు. నిందితుడిగా భావిస్తున్న యువకుడు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన మైనర్ గా తెలిసింది. అయితే ఇప్పుడు మరో యువకుడు దుర్గారావు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం. దుర్గారావు సతీష్ కలిసి దాడి చేశారని పోలీసులు అనుమానాన్ని తెలిపారు జగన్ పై రాయి దాడి పై పోలీసులు ఎలా అయినా ఛేదించాలని చూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news