సినీ రాజకీయం, సినీ ప్రముఖులకు పదవుల గాలం…?

-

ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణాలో ఇప్పుడు రాజకీయం కాస్త ఆసక్తిగా మారుతుంది. ఉన్న అవకాశాలను వాడుకోవడానికి అక్కడ, ఇక్కడి ప్రధాన పార్టీలు నానా కష్టాలు పడుతున్నాయి. అధికారం నిలబెట్టుకోవడానికి జగన్, కేసీఆర్ ఇప్పుడు శాయశక్తులా కష్టపడుతున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షాలు సైతం తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అటు ఇటుగా ఉండటంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు అన్ని పార్టీల నాయకులు… కొత్త నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే కొందరు సినిమా వాళ్లకు గాలం వేయాలని చూస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల్లో సినిమా గ్లామర్ ఉండగా… దాన్ని మరింతగా పెంచే యోచనలో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల బిజెపి… తెలంగాణాలో జయసుధను పార్టీలోకి తీసుకుంది. త్వరలోనే అధికార తెరాస లోకి కూడా చేరికలు ఉంటాయని అంటున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ సినీ నటుడ్ని… మల్కాజ్ గిరి ఎంపీ గా నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు సిఎం కేసీఆర్. ఇక కాంగ్రెస్ కూడా… గతంలో ఉన్న సినిమా పరిచయాలను వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఒక ప్రముఖ హీరోతో చర్చలు జరుపుతున్నారని ఆయన ఓకే అంటే కూకట్పల్లి అసెంబ్లీ సీటు ఆయనకు ఇవ్వడానికి రెడీ గా ఉన్నారని అంటున్నారు. అలాగే సనత్ నగర్ నుంచి కూడా ఒక సినిమా నటుడ్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. అటు జనసేనకు పవన్ కళ్యాణ్ రూపంలో సినీ గ్లామర్ ఉండగా… సిఎం జగన్ చాలా మంది సినిమా వాళ్ళతో చర్చలు జరుపుతూ తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారట. ఇప్పటికే పలువురుకి పదవులు కూడా ఇచ్చారట. తెలుగుదేశం పార్టీ… ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సినిమా వాళ్లకు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news