బ్రేకింగ్: ఉస్మానియా వద్ద ఉద్రిక్తత

-

ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉస్మానియా యునివర్సిటీ వద్దకు బిజెపి జాతీయ యువ మోర్చా అధ్యక్షుడు , బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య వెళ్ళారు. దీనితో అక్కడ వాతావరణం వేడెక్కింది. ఎన్ సీసీ గేట్ దగ్గర బిజెపి మెర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ను అడ్డుకున్నారు పోలీసులు. లోపలికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసారు.

పోలీసులకు బీజేపీ కార్యకర్తల కు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు లోపలకు అనుమతించిన పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఓయూ లోపలకు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. పోలీసులుకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరగగా వాహనం దిగి నడుచుకుంటూ ఆర్ట్స్ కాళాశాల వద్దకు తేజస్వీ సూర్య వెళ్ళారు.

Read more RELATED
Recommended to you

Latest news