మంత్రిని టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లా వేంకటగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత, ప్రస్తుతం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామ నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఒకసారి ఆయన వార్తల్లో ఇదే విధంగా నిలిచారు. ఇప్పుడు మరోసారి ఆయన రెండు రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు.

జలవనరుల శాఖ అధికారులు అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు ఆయన. నియోజకవర్గంలో అన్ని నీటి లెక్కలు కూడా తప్పుల తడకలు అంటూ ఆయన అధికారులను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసారు. ఒక్క అధికారి కూడా సరిగా సమాధానం చెప్పడం లేదని అన్నారు ఆయన. స్వయంగా సిఎం వైఎస్ జగన్ చెప్పినా సరే సోమశీల స్వర్ణముఖి కెనాల్ ని అధికారులు పరిశీలించడం లేదని అన్నారు ఆయన.

జలవనరుల శాఖ అధికారులు నియోజకవర్గాన్ని పూర్తిగా మర్చిపోయారని అన్నారు. నిధులు వచ్చినా సరే ఇవ్వడం లేదన్నారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జలవనరుల శాఖనే కావడం, దానికి తోడు మూడు రోజుల్లో లెక్కలు అన్ని బయటపెడతా అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు దుమారం రేగుతుంది. మంత్రి అనీల్ కుమార్ ని ఆయన టార్గెట్ చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news