మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డ అంబ‌టి రాంబాబు.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు!

-

ఏపీ వైసీపీ ఎమ్మెల్యే అయిన అంబ‌టి రాంబాబు కు వివాదాలు కొత్తేమీ కాదు. త‌ర‌చూ ఏదో ఒక సంచ‌ల‌న కామెంట్లు చేస్తూ విమ‌ర్శ‌ల పాల‌వుతుంటారు ఆయ‌న‌. ఇప్పుడు మ‌రోసారి అలాగే నోరుజారి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో నెటిజ‌న్లు ఆయ‌న్ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. ముందుగానే ఆవేశ‌ప‌రుడైన రాంబాబు అన్ని విష‌యాల‌పై ఓవ‌ర్‌గా స్పందించ‌డ‌మే ఆయ‌న కొంప ముంచుతోంది.

అంబ‌టి రాంబాబు
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న చంద్రబాబుపై ఘోర‌మైన కామెంట్లు చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా విజృంభిస్తుంటే వారిద్ద‌రూ రాష్ట్రంలో ఉండ‌కుండా ప‌క్క‌రాష్ట్రంలోని హైద‌రాబాద్‌లో చంద్రబాబు, లోకేష్ ఉంటారా అంటూ మండిప‌డ్డారు.

ఇదే క్ర‌మంలో కాపు సామాజిక వ‌ర్గంపై అంబ‌టి దారుణ‌మైన కామెంట్లు చేశారు. ఏపీలో ఉన్న కాపులు ఎక్కువ‌గా ఆవేశపరుల‌ని, వారు మాంసం అతిగా తింటూ, మందుకు బానిస‌లుగా ఉంటున్నార‌ని, చాలా తెలివితక్కువవాళ్లని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు అంబ‌టి రాంబాబు. అంతే ఇక ఈ వీడియోపై నెటిజ‌న్న‌లు దారుణంగా ఆడుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో అంబ‌టిని విమ‌ర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా అంబ‌టి కాస్త దూకుడు త‌గ్గించుకోవాల‌ని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news