ష‌ర్మిల‌కు మ‌రో షాక్.. ఆ మ‌హిళా నేత‌ మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికేనా..?

-

వైఎస్ ష‌ర్మిల‌(sharmila)కు పార్టీ పెట్ట‌క ముందు అనేక స‌వాల్లు ఎదుర‌వుతున్నాయి. ఇప్ప‌టికే చాలామంది ఆమె పార్టీని వీడ‌గా.. చాలా మంది అడ్‌హ‌క్ క‌మిటీల ప‌ద‌వుల‌కు కూడా గుడ్‌బై చెబుతున్నారు. అభిమానుల్లో వ‌ర్గాలు ఏర్ప‌డ‌టంతో ఆమె ఎటూ తేల్చుకోలేక‌పోతోంది. ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేయ‌డంతో ఎవ‌రి మాట‌లు న‌మ్మాలో కూడా ఆమెకు పెద్ద‌గా అర్థం కావ‌ట్లేదు. ఇక ఈ క్ర‌మంలో ఇప్పుడు ఆమెకు మ‌రోషాక్ త‌గ‌ల‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

ష‌ర్మిల‌ /sharmila
ష‌ర్మిల‌ /sharmila

ష‌ర్మిల వ‌ర్గంలో మొద‌టి నుంచి కీల‌కంగా ప‌నిచేస్తున్న ఇందిరా శోభన్ గౌడ్ ఇప్పుడు పార్టీ మార‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈమె కాంగ్రెస్ నుంచి వ‌చ్చి ష‌ర్మిల చేసిన జిల్లాల పర్యటనల ద‌గ్గ‌రి నుంచి అడ్ హాక్ కమిటీల ఏర్పాటు దాకా అన్నింటా చురుగ్గా వ్య‌వ‌హ‌రించారు.

అయితే ఇప్పుడు ఆమెకు షర్మిలకు ప‌డ‌క‌పోవ‌డంతో ఆమె కాస్త అసంతృప్తిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఇదే క్ర‌మంలో అటు కాంగ్రెస్‌కు కూడా కొత్త బాస్ గా రేవంత్ రావ‌డంతో ఆమె మ‌ళ్లీ అటు వైపు చూస్తున్నార‌ని స‌మాచారం. ఎందుకంటే ఆమెపై ఇత‌ర ష‌ర్మిల అభిమానులు వ‌రుస‌గా ఫిర్యాదులు చేయ‌డంతో ఇమ‌డ లేకి ష‌ర్మిల‌ను హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. ఇక రేవంత్ కూడా రీసెంట్‌గా ఆమెను క‌లిసి పార్టీలోకి ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. అదే జ‌రిగితే ష‌ర్మిల‌కు పెద్ద దెబ్బే త‌గులుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news