ముగిసిన ఏపీ కేబినెట్.. తీసుకున్న‌ కీల‌క‌ నిర్ణయాలు ఏంటంటే..?

-

ఏపీ కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. మొత్తం ఏడు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వాటిలో రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఓకే చెప్పింది. దీంతో పాటు 11వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. భూములిచ్చిన రైతలుకు కౌలు 10 నుంచి 15 ఏళ్లకు పెంచారు.

సీఆర్డీయే చట్టం ఉపసంహరణ, పరిపాలన వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అమరావతిలోనే మూడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా విశాఖలో సచివాలయం ఏర్పాటు చేసి, హెచ్ఓడీ కార్యాలయాలు కూడా అక్కడే ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మ‌రియు అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news