సంచలన లేఖ రాసిన ఏపీ మంత్రి…!

-

నెల్లూరులో కలకలం సృష్టిస్తుంది ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి లేఖ. మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఘోరంగా పారిశుద్ద్యం పేరుకుంది. ఎన్నిసార్లు క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ చేసినా పట్టించుకోని అధికారుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేసారు. మంత్రిని స్వయంగా కలవమని చెప్పినా లెక్కచేయడం లేదు హెల్త్ ఇన్స్పెక్టర్ డాక్టర్ వెంకటరమణ. కలెక్టర్ కి స్వయంగా లేఖ రాసి చర్యలు తీసుకోవాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు.

అంతకి‌ నాలుగు రోజులు ముందు మున్సిపల్ అధికారులతో రివ్యూ చేసిన మరో మంత్రి అనిల్ కుమార్… కీలక ప్రకటన ఒకటి చేసారు. ఆరేడు నెలల్లో‌ నగరం రూపురేఖలు మార్చేస్తామని‌ ప్రకటన చేసారు. మంత్రి చెబితేనే అధికారులు లెక్కచేయకుంటే, సామాన్యుల పరిస్థితి ఏమటని చర్చిస్తున్నారు ప్రజలు. ఈ లేఖ ఇప్పుడు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news