ఎన్నికల సంఘం నిజాయితీగా ఉంటే మేమే గెలుస్తాం: బండి సంజయ్

-

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా పని చేసి ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికలలో బిజెపి మెరుగైన స్థానాలను సాధించి ఉండేది అని తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బిజెపి) చీఫ్ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల నోటిఫికేషన్ నుండి పోలింగ్ వరకు “ఎన్నికల కమిషన్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి అనుకూలంగా ఎన్నికలను నిర్వహించింది” అని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.

bandi-sanjay

“ఎన్నికల నోటిఫికేషన్ నుండి పోలింగ్ వరకు, ఎన్నికల కమిషన్ను అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నడిపింది అన్నారు. … ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరిస్తే, మేము మరో 20 స్థానాలను కైవసం చేసుకునే వాళ్ళం అని ఆయన అనారు. “2016 లో బిజెపికి కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే ఉండగా, 2020 లో బిజెపికి 35.56 శాతం ఓట్లు వచ్చాయి అని ఆయన చెప్పారు. చాలా చోట్ల మేము స్వల్ప తేడాతో ఓడిపోయాము అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news