కౌశిక్‌రెడ్డికి బీసీ వ‌ర్గాల సెగ‌.. తోక‌ల‌తోనే గౌర‌వ‌మా..!

-

తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డంతో కౌశిక్‌రెడ్డి కూడా టీఆర్ ఎస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. కాగా ఆయ‌న మొద‌టి నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫునే ప్ర‌చారం చేస్తున్నారు. ఓ ద‌శ‌లో ఆయ‌నే క్యాండిడేట్ అని కూడా అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ త‌ర్వాత ప‌రిణామాలు మారిపోవ‌డంతో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి ఇప్పుడు టీఆర్ ఎస్ కండువా క‌ప్పుకున్నారు. ఇక ఇప్పుడు మ‌రో వివాదంలో చిక్కుకున్నారు.

అయితే ఆయ‌న మొన్న టీఆర్ఎస్‌లో చేరే క్ర‌మ‌లో నియోజ‌క‌వర్గం నుంచి చాలామంది నేత‌ల‌ను తీసుకెళ్లారు. వారంద‌రికీ కేసీఆర్ చేతులు మీదుగా కండువాలు వేయించాల‌ని కౌశిక్ రెడ్డి వారిని పేర్లు పెట్టి మ‌రీ స్టేజ్ మీద‌కు ఆహ్వానించారు. అయితే ఆయ‌న రెడ్డి, వెలమ కులాల‌కు చెందిన నేత‌ల‌ను చివ‌ర‌కు గారు అని గౌర‌వంగా పిలుస్తూ అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు చెందిన వారిని అయితే కేవ‌లం పేరుపెట్టి పిలిచారు.

ఇక ఈ ఈడియోను హైలెట్ చేస్తూ బీజేపీ కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ చేస్తున్నారు. దీంతో ఇది చూసిన బీసీ నేత‌లు కౌశిక్ పై భ‌గ్గుమంటున్నారు. ఒక్క హుజూరాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాల‌కు చెందిన నేత‌లు ఇప్పుడు ఆయ‌న్ను టార్గెట్ చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ వేసిన ఎత్తుగ‌డ బాగానే ప‌నిచేసింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వ్య‌తిరేకిగా మారిపోయారు కౌశిక్‌.

Read more RELATED
Recommended to you

Latest news