అక్టోబర్ 7 నుంచి బెజవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలు : మార్గదర్శకాలు ఇవే

-

విజయవాడ : అక్టోబర్ 7 నుంచి 15 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యం లోనే దసరా ఉత్సవాలకు ఆలయ కో ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ద్రుష్ట్యా ఈ ఏడాది 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మూలానక్షత్రం రోజున కేవలం 70 వేల మందికి మాత్రమే అనుమతి ఇస్తూ అన్ని శాఖలు అలెర్ట్ గా ఉండాలని సర్క్యులర్ జారీ చేసింది.

దసరాలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్ లైన్ స్లాట్ తప్పనిసరని.. ఆన్ లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కొండ కింద ఆన్ లైన్ కౌంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 7 వ తేదీన శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ.. 7 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనుంది. దసరా లో మాలధారణ గావించిన భక్తులకు అనుమతినివ్వాలో లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది కో ఆర్డినేషన్ కమిటీ

Read more RELATED
Recommended to you

Latest news