బ్రేకింగ్; అమిత్ షా రాజీనామా…?

-

రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ సమావేశాల్లో వివాదాస్పద బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే సరోగసి బిల్లు కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది. 45 బిల్లు 7 ఆర్ధిక పద్దులు ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

ఇక ఈ సమావేశాల్లో ఢిల్లీ అల్లర్లపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. హోం మంత్రి అమిత్ షా రాజీనామా చెయ్యాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఢిల్లీ అల్లర్ల కేంద్రంగా విపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అటు విపక్షాలను ఎదుర్కోవడానికి కూడా కేంద్రం సిద్దమైంది.

ఈ సమావేశాల సందర్భంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. జెడ్ ప్లస్ భద్రత ఉన్న వాళ్లకు బ్లాక్ కమాండో లను తొలగించే యోచనలో కూడా మోడీ సర్కార్ ఉంది. ఈ విషయం కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక స్టాక్ మార్కెట్ లు కుప్ప కూలడం, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతున్న అంశాలను టార్గెట్ గా చేసుకుని విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version