హుజూరాబాద్ అప్డేట్ రెండో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం

-

హుజూరాబాద్ బైపోల్ కౌంటింగ్ లో రెండో రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. కేవలం స్వల్ప ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. మొదటి రెండు రౌండ్లలో కేవలం హుజూరాబాద్ మండలంలోని గ్రామాల ఓట్లను కౌంటింగ్ చేస్తున్నారు. తాజా రెండో రౌండ్ ముగిసే సరికి.. రెండు రౌండ్లు కలిపి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు 9461 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 9103 ఓట్లు వచ్చాయి. ఫలితంగా 339 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. మొదటి రౌండ్ లో 166 ఓట్ల లీడ్ వస్తే, రెండో రౌండ్ లో 193 ఓట్ల ఆధిక్యం బీజేపీకి వచ్చింది. రెండో రౌండ్ లో బీజేపీకి 4851 ఓట్లు రాగా… టీఆర్ఎస్కు 4659 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 220 ఓట్లు వచ్చాయి.

మరోవైపు కీలకమైన హుజూరాబాద్ మున్సిపాలిటీ కి సంబంధించిన ఓట్ల లెక్కింపు కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ ఫలితాలు బయటకు వస్తే ఏదో ఒక పార్టీకి క్లియర్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news