చంద్రబాబు మీద సరికొత్త కేసు ?

-

తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వేడిని సృష్టిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ పట్ల దారుణమైన పదజాలంతో చంద్రబాబు నాయుడు భయంకరమైన విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ప్రజా చైతన్య యాత్ర లో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ పార్టీ నాయకులను ఫినిష్ చేస్తామని నన్ను ఎవరు టచ్ చేయలేరని చంద్రబాబు క్రూరంగా విమర్శలు చేశారు. Image result for chandrababu

దీంతో అధ్యక్షుడు దారుణంగా మాట్లాడటంతో పార్టీ కార్యకర్తలు కూడా రెచ్చిపోతున్నారు. కుప్పంలో తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర లో టీడీపీ కార్యకర్త ఒకరు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ని ఉద్దేశించి దారుణమైన పదజాలంతో…వాడు, వీడు అంటూ మొద‌లుపెట్టి.. కొడాలి నానిని చంపాలి అంటూ ఆ తెలుగుదేశం కార్య‌క‌ర్త వ్యాఖ్యానించ‌డం విశేషం. అలా కార్య‌క‌ర్త‌ను చంద్ర‌బాబు నాయుడు మ‌రింత ఎంక‌రేజ్ చేశారు.

 

అత‌డి పేరేమిటో అడిగి మ‌రీ తెలుసుకుని.. చంద్ర‌బాబు నాయుడు ఉత్సాహ ప‌రిచారు. దీంతో 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఈ విధంగా వ్యవహరించడం పట్ల చాలామంది రాజకీయ మేధావులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో ఉన్న కొద్ది చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర లో మాటలు రెచ్చగొట్టే విధంగా ఉండటంతో వైకాపా వాళ్లు ఇలానే మాట్లాడితే రాబోయే రోజుల్లో కేసు వేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news