జ‌న‌సేన‌లో చేరిన చ‌ద‌ల‌వాడ‌

-

జనసేన పార్టీలో మరో కీలక నేత చేరారు. టిటిడి మాజీ ఛైర్మన్‌, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన కండువా కప్పుకున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆయన్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విటర్ ద్వారా ప్రకటించింది. పవన్‌ బాణం విసురుతున్న ఫొటోను, కృష్ణమూర్తితో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. అనంతరం పవన్‌, కృష్ణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.

తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన తిరుపతి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. పార్టీకి ఆయన చేసిన సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీలో చేరనున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను చదలవాడ గానీ, జనసేన వర్గాలు గానీ ఖండించలేదు. ఈ క్రమంలోనే ఆయన గురువారం పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news