న్యూస్ ఛానల్ పై ఆగ్రహంతో ఊగిపోయిన బాబు, మంత్రికి కౌంటర్…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యమంత్రి కూడా ధైర్యంగా పర్యటనకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం రైతులు అంటుంటే వైసీపీ నేతలు మాత్రం పెయిడ్ ఆర్టిస్ట్ లు అని ఆరోపించడం ఇప్పుడు రైతులకు ఆగ్రహం తెప్పిస్తుంది. సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి.

ఇక రైతుల ఉద్యమం వద్దకు ఇటీవల వెళ్ళిన ఒక మీడియా ఛానల్ ప్రతినిధి పెయిడ్ ఆర్టిస్ట్ లు అనే వ్యాఖ్య చేయడంతో ఆమెపై దాడి చేసారు. ఈ నేపధ్యంలోనే మంత్రి పేర్ని నాని ఆమెపై దాడిని ఖండించారు. జర్నలిస్టులపై దాడి చేయడం అన్యాయమని, దాడి చేస్తే కనీసం ఖండించకపోవడం మరీ దారుణమని ఆవేదన వ్యక్తం చేసారు. ఎం చెప్పాలో సమాచార మంత్రిగా తనకు మాటలు రావడం లేదన్న ఆయన… విలేకరులకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇక దీనిపై చంద్రబాబు ఘాటుగా కౌంటర్ ఇస్తూ ఊగిపోయారు. ఓ చానల్ ఉందని.. ఆ టీవీ హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకోవడం కోసం.. ఏపీలో రియల్ ఎస్టేట్ దెబ్బతీస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అమరావతిని బలిచేస్తారా? అని ఆగ్రహంగా ఊగిపోయారు చంద్రబాబు. ఈ అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. రాజధాని కోసం రైతులు ఆందోళన చేస్తుంటే వారిని పెయిడ్ ఆర్టిస్టులు, బిర్యానీ కోసం వచ్చారంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news