వ్యూహాత్మకంగా సీఎం జగన్ అడుగులు

-

రానున్న సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ వేస్తున్న అడుగులు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా జగన్‌ అనుసరిస్తున్న విధానాలు, అభ్యర్థుల మార్పులు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. సత్ఫలితాలను ఇస్తే మాత్రం భవిష్యత్‌లో దేశంలోని అనేక పార్టీలు ఈ విధానాలను అనసరించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్‌ టికెట్లు ఇవ్వని ఎంతో మంది నేతలకు టీడీపీ, జనసేనలో టికెట్లు లభిస్తున్నాయి. పలితాలతో సంబంధం లేకుండా ధైర్యంగా జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రస్తుత రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

ఇప్పటి వరకు ప్రకటించిన ఏడు జాబితాల్లో 69 అసెంబ్లీ స్థానాలకు, 18 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను మార్చారు. వీరిలో 30 మంది అభ్యర్థులు కొత్తవారే ఉండడం గమనార్హం. రాజకీయంగా ఉద్ధండులైన సీనియర్‌ నేతలను పక్కనపెట్టి కొత్త వారిని బరిలోకి దించుతుండడం సాహసమనే చెప్పుకోవాలి. ఈ సమీకరణాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని భావించిన సీనియర్‌ నేత వేమిరెడ్డి సూచనలను పట్టించుకోకపోవడంతో ఆయన టీడీపీలో చేరిపోయారు. ఈ స్థానానికి అరబిందో సంస్థలు డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న శరత్‌ చంద్రారెడ్డిని బరిలో దించేందుకు సిద్ధపడుతున్నారు. అలాగే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వంటి వారిని పక్కనపెట్టి సీఎం జగన్ ఆశ్చర్యపరిచారు.

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ అధినేత జగన్ అభ్యర్థుల ఎంపికలో చేస్తున్న ప్రయోగాలు, తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నాయి. రాజకీయంగా అంగ, అర్ధబలం ఉన్న ఎంతో మంది నేతలను కాదని.. యువకులకు, సాధారణ వ్యక్తులకు పార్టీ టికెట్లు కేటాయిస్తున్న తీరు ఇప్పుడు సొంత పార్టీ నేతలనే కాదు.. ప్రతిపక్షాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఏడు విడతల్లో ప్రకటించిన జాబితాల్లో సుమారు 30 మందికిపైగా యువ నేతలకు ఇన్‌చార్జ్‌లుగా జగన్‌ అవకాశాలు కల్పించారు. రాజకీయ అనుభవం, ఆర్థిక బలం వంటి అంశాలతో సంబంధం లేకుండా సర్వేలు ఆధారంగా, సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారు. మొత్తానికి సీఎం జగన్ వ్యూహాలు ఎవ్వరికి అంతుపట్టడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news