బ్రేకింగ్: రేపు మధ్యాహ్నం 3 గంటలకు జగన్ కీలక భేటీ…!

-

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య జల వివాదం ఇప్పట్లో సమసిపోయే విధంగా లేదు. రాజకీయ కారణాలు కూడా ఇప్పుడు ఈ జల వివాదంలో ప్రభావం చూపిస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం సాగునీటిపై సమీక్ష నిర్వహించిన తెలంగాణా సిఎం కేసీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ కయ్యానికి కాలు దువ్వుతుంది అని. ఈ నేపధ్యంలో సిఎం జగన్ రేపు మధ్యాహ్నం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం అవుతున్నారు.

jagan

కేసీఆర్ వ్యాఖ్యలను ఏపీ సిఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. సాగునీటిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అపెక్స్ కమిటీ భేటీ పై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ఈ మేరకు సాగునీటి ఉన్నతాధికారులు, మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణా సుప్రీం కోర్ట్ కి వెళ్ళడం పై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news