బిగ్ బ్రేకింగ్ : కరోనాతో సీఎం పీఏ మృతి..!

-

దేశవ్యాప్తంగా కరోనా విజృంబిస్తుంది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లోనే 2003 మంది చనిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు, దీని తీవ్రత ఎలా ఉందో. ఎవరికీ వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధాని, సీఎంలతో సహా అనేక మంది ప్రముఖులు చెప్తున్నారు. రాష్ట్రాల వారీగా చూసుకుంటే దీని ప్రభావం ముంబై పై అధికంగా ఉంది. అలాగే తమిళనాడులో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజా ప్రతినిధులపై, అధికారులపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది. తమిళనాడులో తాజాగా కరోనా వైరస్‌తో తమిళనాడు సీఎం పీఏ మృతి చెందారు. తమిళనాడు సీఎం పళని స్వామి పీఏ దామోదరం ఇవాళ కోవిడ్‌తో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. దీంతో మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news