రాజమౌళి అంతటి వారే తగ్గుతుంటే సుకుమార్ మాత్రం లెక్కచేయడం లేదట ..!

-

ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 400 కోట్ల భారీ బడ్జెత్ తో తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌద్రం రణం రుధిరం’. ఎన్.టి.ఆర్, రాం చరణ్, ఆలియా భట్, ఓలియా మోరెస్, అజయ్ దేవగన్ తో సహా కొందరు హాలీవుడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. భారీ కాన్వాయిస్ తో రూపొందుతున్న ఈ సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ చేయాల్సింది. కాని వీ.ఎఫ్.ఎక్స్ వర్క్స్…గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటంతో వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ చేయాలని డేట్ తో సహా అధికారకంగా ప్రకటించారు.

 

కాని కరోనా దెబ్బతో మొత్తం తారుమారు అయింది. ఇప్పటికే బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ పెరిగింది. 6 నెలలు పోస్ట్ పోన్ అంటే ఊహించనంతగా బడ్జెట్ పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది పెద్ద రిస్క్ అండ్ సాహసమని చెప్పాలి. అయితే ఇక నుంచి వీలైనంత తక్కువ బడ్జెట్ ఆయ్యోలా రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటినుంచి ఎక్కడ బడ్జెట్ కంట్రోల్ చేయాలో అని యూనిట్ తో చర్చిస్తున్నారట. అందుకు తగ్గట్టుగానే మిగతా షూటింగ్ జరపాలని అనుకుంటున్నారట.

కాని ఈ విషయంలో సుకుమార్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదని అంటున్నారట. వాస్తవంగా ఈ సినిమాలోని సన్నివేశాలని కేరళ అలాగే విదేశాలలో ప్లాన్ చేసి డ్రాపయ్యారు. ఒక్క కేరళలో అనుకున్న దానికే మూడు కోట్ల వరకు దెబ్బ పడిందని టాక్ ఉంది. అయితే ఇప్పుడు కేరళ వంటి దట్టమైన అడవులని తలపించేలా హైదరాబాద్ లో సెట్ నిర్మిస్తున్నారట. ఇందుకోసం భారీగానే ఖర్చు అవుతుందట. అయినా ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదని నిర్మాతలకి సూచించారట సుకుమార్. ఇప్పుడు సుకుమార్ ప్రవర్తన ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news