కాంగ్రెస్‌లో రేవంత్‌కి పెరుగుతున్న అస‌మ్మ‌తి

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త‌న‌దైన స్టైల్లో ప‌రిపాల‌న సాగిస్తున్నారు.ఏఐసీసీ స‌పోర్ట్ త‌న‌కే ఉంద‌ని చెప్తూ అన్ని ర‌కాల నిర్ణ‌యాలు తానే తీసుకుంటూ దూసుకుపోతున్నారు.అయితే ఈ విధానంపై కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్‌లు వ్య‌తిరేకంగా ఉన్నారు.దీంతో రేవంత్‌ను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదట. ఇటీవ‌ల‌జ‌రిగిన ఖమ్మం పర్యటనను కూడా వాడేసుకున్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్లారు. సాధారణంగా వదర బాధితుల దగ్గరకు వెళ్లినప్పుడు ఎవరైనా వారి ఇళ్లకు వెళ్లి,కలిసి మాట్లాడతారు.

కానీ సీఎం టూర్ లో అవేవీ లేకుండా చేశారు. ఒకట్రెండు ఇళ్లను మాత్రమే పరిశీలించారు. ఆ తర్వాత రోడ్ షో చేస్తూ వెళ్లిపోయారు. ఇలా ప్రచారరథంపై ఎక్కి చేతులూపుతూ వెళ్లిపోవడంపై వ‌ర‌ద బాధితులు భగ్గుమన్నారు. తమ బాధలు తెలుసుకోలేని వ్యక్తి ఇక్క‌డికి ఎందుకు వచ్చారంటూ మండిపడ్డారు. పరామర్శకు వచ్చి తిరిగిన వాహ‌నం ఎన్నిక‌ల‌ ప్రచార రథం కావడంతో సిఎం వైఖ‌రి కాంగ్రెస్‌ను మరింత అభాసుపాలు చేసిందని తెలుస్తోంది.వాహ‌నంపై ఉన్న‌ పార్టీ సింబల్స్ కనిపించకుండా క్లాత్ తో కవర్ చేయ‌డంపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రేవంత్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. సీఎం పర్యటించింది కూడా జిల్లా కేంద్రంలోనే. అలాంటప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి వేరే మంచి వాహనమే దొరకలేదా అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.సీఎం త‌ల‌చుకుంటే హైదరాబాద్ నుంచి ప్రభుత్వ వాహనం తెప్పించి పర్యటించవచ్చు. కానీ అలా జరగపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం పర్యటనలో ఆధ్యంతం ప్లానింగ్ తో, జాగ్రత్తగా ఉండాల్సిన అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కూడా చర్చనీయాంశంగా మారింది.సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన తర్వాత జనాల్లోనే కాదు పార్టీ వర్గాల్లోనూ ఇదే చర్చ నడుస్తోందట. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహ‌నానికి పార్టీ సింబ‌ల్స్ క‌నిపించ‌కుండా వ‌స్ర్తాలు క‌ప్ప‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కావాలనే ఇదంతా చేసినట్లు ఉందని,సీఎంని మరీ ఇంతలా అవమానించాలా ? అనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. కొందరు దురుద్దేశపూర్వకంగానే ఇలా చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.

సీఎం రేవంత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే మంత్రులు,అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొందరు మాట్లాడుకుంటున్నారు. కేవలం వాహనం విషయంలోనే కాదు.. సీఎం షెడ్యూల్ విషయంలోనూ కుట్రలు జరిగాయని ఆయన వర్గం నేతలు బాధపడుతున్నారట. కారు దిగి ప్రజలను కలవకుండా చేశారని.. తద్వారా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేలా చేశారని మండిపడుతున్నారట. ముఖ్యమంత్రిని పిలిచి మరి అవమానిస్తారా అని ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఓ వైపు ప్రజలు బాధల్లో ఉంటే ఆదుకోవాల్సింది పోయి.. ఇలా సొంత పార్టీ వాళ్లే ఒకరిని ఒకరు అవమానపర్చుకోవడం ఏంటని చర్చించుకుంటున్నారు.

దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో కూడా సీఎం వర్గం ఉందని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.రేవంత్‌రెడ్డి సీఎం అయిన తొలినాళ్ళ‌లో చాలామంది సీనియ‌ర్‌లు వ్య‌తిరేకించారు. ఎప్ప‌టినుంచో పార్టీని అంటిపెట్టుకుని కాపాడుకుంటున్న త‌మ‌ను కాద‌ని ఇటీవ‌ల పార్టీలోకి వ‌చ్చిన వ్య‌క్తికి అన్ని ర‌కాలుగా ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ఏంట‌ని కొంద‌రు బ‌హిరంగంగానే పెద‌వి విరిచారు.అప్ప‌టి నుంచి సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా సీఎం చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకిస్తున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్‌లు.అందులో ఖ‌మ్మం వ‌ర‌ద ప్ర‌భావ ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న కూడా ఒక‌టైంది.

Read more RELATED
Recommended to you

Latest news