గ్రేట‌ర్ పోల్‌కు స‌ర్వం సిద్ధం

-

గ్రేట‌ర్ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డింది. ప్ర‌చారం ముగియ‌డంతో మైక్ మూగ‌బోయాయి. ప్ర‌చార ప‌ర్వం ముగియ‌డంతో అభ్య‌ర్థులు ప్ర‌లోభ ప‌ర్వంపై దృష్టి సారించారు. దీంతో అంతా గప్‌చుప్ అయిపోంది. ఇక గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు అధికారులు స‌ర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 150 వార్డులకు గాను 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు 52,500 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.

పోలింగ్ కోసం మొత్తం 9,101 కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ విధుల్లో 45 వేల మంది ఎన్నికల సిబ్బంది పాల్గొననున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ జ‌రుగ‌నుంది. పాజిటివ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటువేసే అవకాశం కల్పించారు. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో వృద్దులు, విక‌లాంగుల‌కు ప్ర‌త్యేక క్యూలైన్ల ఏర్పాటు చేశారు. ఇప్ప‌టికే ప్రతి పోలింగ్ కేంద్రాన్ని శానిటైజేషన్ చేశారు. ఓటు వేసేందుకు వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, మాస్క్ ఉంటేనే పోలింగ్ కేంద్రంలోకి అనుమ‌తిస్తామ‌ని అధికారులు సూచిస్తున్నారు. ఇక బయటి వ్యక్తులు జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్లాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news