బిజేపి లోకి చేరనున్న హిందుస్థానీ అవామ్​ మోర్చా-సెక్యులర్..!

-

ఎన్డీఏ కూటమిలో మరో పార్టీ చేరనుంది. బిహార్​ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్​ మాంఝీ సారథ్యంలోని హిందుస్థానీ అవామ్​ మోర్చా-సెక్యులర్​(హామ్​​) ఈ కూటమిలో చేరనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మాంఝీ ఇవాళ(ఆగస్టు 30న) వెలువరిస్తారని పేర్కొన్నాయి. ఆగస్టు 20న మహాకూటమి నుంచి వైదొలొగింది హామ్​. అనంతరం ఈ పార్టీ.. అధికార జేడీయూ​లో విలీనం అవుతుందని ప్రచారం జరిగింది. సీఎం నితీశ్​ కుమార్​ను మాంఝీ గురువారం కలవడం.. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది.మహాకూటమి, ఎన్​డీఏకు ప్రత్యామ్నాయంగా జేఏపీ, వీఐపీ వంటి స్థానిక పార్టీలతో కలిసి మూడో కూటమి ఏర్పాటు చేయాలని మాంఝీ తొలుత భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కష్టతరమని భావించి తన ఆలోచన విరమించుకున్నారట.బిహార్​లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి.

ఎన్డీఏ కూటమిలో చేరితే తమ పార్టీకి 9 నుంచి 12 స్థానాలు దక్కుతాయని ‘హామ్’​ నమ్మకంతో ఉంది.మరోవైపు మాంఝీ రాకతో దళిత ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందని బిజేపి-జేడీయూ కూటమి భావిస్తోంది. ఆ వర్గానికే చెందిన రామ్​ విలాస్ పాసవాన్​ కూడా ఎన్డీఏలో ఉండటం తమకు మరింత కలసివస్తుందని అనుకుంటున్నాయి.బిహార్​లో మొత్తం 7 కోట్ల 21లక్షల 40వేలకు పైగా ఓటర్లున్నారు. ఇందులో 15 శాతం ఓట్లు దళితులు, మహాదళితుల వర్గానికి చెందినవే. మొత్తం ఓట్లలో.. ముస్లింలు 17 శాతం, ఓబీసీ 50 శాతం, అగ్రవర్ణాలు 19 శాతం, ఇతరులు 2 శాతం ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news