ఆసుపత్రిలో బీజేపీ సీనియర్ నేత, ఫైర్‌బ్రాండ్ ఉమా భారతి..?

-

బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వైరస్ పాజిటివ్ గా తేలిన ఉమాభారతి జ్వరం తీవ్రంగా ఉండడంతో…రిషికేష్ లోని ఎయిమ్స్ లో చేరారు. ఇటీవల ఆమె కేధార్ నాథ్, బద్రీనాత్ ఆలయాల్లో ప్రత్యేక పూజలకు హాజరయ్యారు. తర్వాత ఆమెకు కరోనా లక్షణాలు రావడంతో…టెస్ట్ చేయించుకుని క్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా ఆమెకు జ్వరం తీవ్రత పెరగడంతో ఎయిమ్స్ లో చేరినట్టు ట్వీట్ ద్వారా తెలిపారు ఉమాభారతి.

డాక్టర్లు అనుమతిస్తే…రేపు బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెలువడనుండగా… హాజరువుతానని తెలిపారు ఉమాభారతి. కేసు తీర్పు వినేందుకు…త్వరగా కోలుకోవాలని హాస్పిటల్ లో చేరినట్టు తెలిపారామే. తనకు రెండోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు చెప్పారు. తన ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని తెలిపారు బీజేపీ నేత. కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా తన ఆరోగ్యంపై వాకాబు చేసినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news