హుజూరాబాద్‌లో ఉపఎన్నిక వ‌స్తే టీఆర్ ఎస్ త‌ర‌ఫున ఆమెకే ఛాన్స్‌?

-

ఇప్పుడు తెలంగాణ‌లో రాజ‌కీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అన్న మాదిరిగా రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. అయితే ఇప్పుడు ఎలాగూ ఉప ఎన్నిక ఖాయం అనేలాగేఉంది. మ‌రి ఇలాంటి టైమ్‌లో హుజూరాబాద్ నుంచి ఈట‌ల‌ను ఢీకొట్టేదెవ‌రు అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

అయితే ఇప్పుడున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల ప్ర‌కారం ఈ ప్రాంతంలో ప‌ట్టున్న కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు కుటుంబానికి టీఆర్ ఎస్ టికెట్ ద‌క్కే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ల‌క్ష్మీకాంత‌రావు భార్య స‌రోజ‌న‌మ్మ ఇంత‌కు ముందు హుజూరాబాద్ ఎంపీపీగా బాధ్య‌తలు నిర్వ‌హించారు.

అయితే అప్పుడు ఎంపీటీసీలంద‌రూ ఈట‌ల మ‌ద్ద‌తుతోనే స‌రోజ‌న‌మ్మ‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి తొల‌గించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాబ‌ట్టి ఇప్పుడు ఈట‌ల‌పై పోటీచేసి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని కెప్టెన్ కుటుంబం భావిస్తోంది. మ‌హిళ అయితే సింపతీ కూడా వ‌స్తుంద‌ని అందుకే ఆమెకే టిక్‌ట్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news