జగన్ ఎఫెక్ట్… దెబ్బకు సెట్ అయ్యారు… వెంటనే కలిసి ర్యాలీ…!

-

ఆర్కే బీచ్ రోడ్ లో విశాఖపట్నం మహానగరపాలిక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ విశాఖ మార ధాన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమం కాళీమాత టెంపుల్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు జరుగుతుంది. ముఖ్య అతిధిగా ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు అయ్యారు. అలాగే ఎంపీ సత్యనారాయణ ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాధ్, కరణం ధర్మ శ్రీ వైసీపీ నేతలు, జివిఎంసి కమిషనర్ సృజన హాజరు అయ్యారు.

నిన్న విజయసాయిని, గుడివాడ అమర్ నాథ్ ని, కరణం ధర్మశ్రీని జగన్ పిలిచి విభేదాలను పరిష్కరించారు. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో వీరు ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. దీనితో సిఎం జగన్ జోక్యం చేసుకుని పార్టీ కోసం కలిసి పని చేసుకోవాలని నేతలకు సూచించారు. నిన్న సాయంత్రం వారు జగన్ తో భేటీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news