కేంద్ర ప్రభుత్వ పథకానికి …కేసీఆర్ గ్రీన్ సిగ్నల్…!?

-

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వస్తి చెప్పినట్లే కనిపిస్తున్నారు. ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది. తెలంగాణలో ఆరోగ్యశ్రీతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకమే అద్భుతంగా ఉందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు, మోదీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్నీ అమలు చేయాలని నిర్ణయించింది.ఈ విషయాన్ని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ హాజరయ్యారు.

సీఎం కేసీఆర్ భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంతో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని జోడించడానికి నిర్ణయం తీసుకున్నారని సోమేశ్ కుమార్ తెలియజేశారు.అంతకుముందు ప్రధాని మోడీ ఆయుష్మాన్ భారత్ , ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్ష జరిపారు. అందులో తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ ద్వారా అన్ని గృహాలకు పంపులతో సురక్షితమైన నీటిని అందించిందని మోడీ గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో 98.5 శాతం గృహాలు సురక్షితమైన తాగునీటితో కవర్ అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం మోడీకి తెలిపింది. కాగా.. 2018లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ను తీసుకొచ్చింది. ఒక్కో కుటుంబానికి ఏటా 5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తోంది.ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

గతంలో నియంత్రిత సాగు వేయాలని రైతులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పంటలనే సాగు చేయాలని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కు తగ్గింది. ఆ తర్వాత వెంటనే కేంద్రం తెచ్చిన వ్యవసాయ సంస్కరణట చట్టాల వల్ల పల్లెల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాల్సి వస్తుందని అధికారులు ప్రభుత్వానికి చెప్పారని ఓ ప్రకటన వచ్చింది. అంటే, ప్రభుత్వం ఆ కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడానికి డిసైడైనట్టు పరోక్షంగా ప్రకటించింది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన భారత్ బంద్‌లో అందరి కంటే పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి, జాతీయ రహదారులను దిగ్బంధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అది జరిగిన కొన్ని రోజులకే కేంద్రం చట్టాలకు జై కొట్టింది ఎల్ఆర్ఎస్ ను ఎత్తేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ విషయంలో కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం విశేషం..

Read more RELATED
Recommended to you

Latest news