ఆ వ‌ర్గ ప్ర‌జ‌లను క్ష‌మాప‌ణ‌లు కోరుతున్న మ‌ల్లారెడ్డి.. గులాబీ బాస్ సీరియ‌స్ అయ్యారా..

-

మంత్రి మ‌ల్లారెడ్డి ఇప్పుడు టీఆర్ ఎస్ మంత్రి వ‌ర్గంలో ఉండి కూడా ఆయ‌న సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కు గుర‌వుతున్నారు. ఎందుకంటే ఆయ‌న నోటి జారుడు వ‌ల్ల చాలా ఇబ్బందులు ప‌డుతూనే ఉన్నారు. ఓక మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎంత హుందాగా వ్య‌వ‌హ‌రించాలో మిగ‌తా మంత్రులు చూపిస్తున్నా కూడా ఆయ‌న మాత్రం అవేవీ పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా ఇప్పుడు కూడా అదే దూకుడును చూపిస్తూ చివ‌ర‌కు ట్రోలింగ్ కు గుర‌వుతున్నారు. ఇక ఆయ‌న మీద గ‌తంలో కూడా వ‌చ్చిన ఆరోప‌న‌ల‌తో ఆయ‌న చేసిన ప‌నుల‌తో అధిష్టానం కూడా సీరియ‌స్ అయ్యింది.

ఇక ఇప్పుడు రేవంత్ మంత్రి మ‌ల్లారెడ్డిపై దీక్ష‌లో మాట్లాడుతున్న క్ర‌మంలో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో మంత్రి త‌న స‌హ‌నాన్ని కోల్పోయారు. రేవంత్ పై గ‌తంలో ఎన్న‌డూ లేన‌న్ని తిట్ల పురాణాల‌ను ఎత్తుకున్నారు. ఈ విధంగా రెచ్చిపోయి తిట్ల దండ కం ఎత్తుకున్న మ‌ల్లారెడ్డి రెచ్చిపోయి రేవంత్‌రెడ్డిని ఓ వ‌ర్గంతో పోల్చేశారు. అయితే ఇది కూడా తిట్ల పురాణంలో భాగంగానే ఉండ‌టంతో వారు ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు.

ఇక టీఆర్ ఎస్ అధిష్టానం కూడా ఈ విష‌యంపై ఫుల్ సీరియ‌స్ అవుతోంది. ఒక మంత్రిగా ఉండి ఇలా ఒక‌రిని అవ‌మానించ‌డం ఏంటని కేసీఆర్ కూడా సీరియ‌స్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మంత్రి మ‌ల్లారెడ్డి దిగి వ‌చ్చారు. ఆ వ‌ర్గం ప్ర‌జ‌లు త‌న‌ను క్ష‌మించాల‌ని, తాను ఏదో తొంద‌ర‌పాటులో అలా అన్నాన‌ని, త‌న‌కు ఎలాంటి ఉద్ధేశం లేద‌ని త‌న‌ను క్షమించాల‌ని, త‌న‌ది త‌ప్పు అయింద‌ని చెప్తున్నారు. దీంతో ఆయ‌న మ‌రోసారి చుల‌క‌న అయిపోయారు. ఇలా అయితే ఎలా అంటూ సొంత పార్టీ నేత‌లే ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారంట‌.

Read more RELATED
Recommended to you

Latest news