టీఆర్ఎస్​తో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ .. మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలు

-

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటించారు. చాలా బాధతో రాజీనామా చేశానని.. పూర్తి వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాసినట్లు చెప్పారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు.

తెలంగాణ బాగు కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్​తో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుందని.. ఈ విషయం ప్రజల్లో బాగా పాతుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఇప్పుడున్న పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ పార్టీ విఫలమైందని ఆయన ఆక్షేపించారు.

‘‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటికి నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతూ వచ్చాం. అయినా ఆయన్ను ఆరేళ్ల పాటు కొనసాగించారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించే వ్యక్తులు హైకమాండ్‌కు ప్రతినిధిగా ఉంటూ అందరినీ సమన్వయం చేయాలి. తప్పులు, లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. కానీ వారు పీసీసీ అధ్యక్షులకు ఏజెంట్లుగా మారిపోయారు. కాంగ్రెస్‌లో డబ్బు ఇచ్చే వాళ్ల మాటే చెల్లుతుంది’’అని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news