కేంద్ర మంత్రికి పేదలు కనిపించడం లేదా..? : గంగుల

-

కరోనా సంక్షోభంలో ఐదు కిలోలు ఉచిత రేషన్ అని చేతులు దులుపుకున్న కేంద్రం ఎక్కడా అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. అదనపు బియ్యానికి రూ. 3,862కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో కనీసం సరితూగగలరా అని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​కు నిరుపేదలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.పేదల కడుపు మాడ్చుతోంది ఎవరని నిలదీశారు.

‘ఓ వైపు మా వడ్లు కొనమంటూ… ఇప్పుడు మేము మా ప్రజలకిచ్చే బియ్యంపై పెత్తనం చేస్తున్నారు. చరిత్రలో రేషన్ షాపుల్లో ప్రధాని ఫోటోలు ఉన్నాయా.. ఇది పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ఠ కాదా’ అని మంత్రి గంగుల ప్రశ్నించారు.

రేషన్ బియ్యానికి సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తప్పు బట్టారు. తెలంగాణలో 90.34 లక్షల కార్డులుంటే అందులో కేవలం 59 శాతం కార్డులకు మాత్రమే.. అదీ ఒక్కరికి ఐదు కిలోల బియ్యాన్ని కేంద్రం అందిస్తున్న విషయం నిర్మలా సీతారామన్​కు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రం పట్టించుకోని ఆకలితో అలమటిస్తున్న 95 లక్షల మందికి.. ప్రతి కిలోపై 33 రూపాయలు వెచ్చించి ఎలాంటి పరిమితులు లేకుండా ఇంట్లోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కడుపునిండా అన్నం పెడుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news