వర్ల రామయ్యను బలిపశువు చేసిన చంద్రబాబు..!

-

రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం లేకున్నప్పటికీ దళితుడైన వర్ల రామయ్యను, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బరిలోకి దింపడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే.రోజా మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్ధపు రాజకీయాల కోసం వర్ల రామయ్యను బలిపశువును చేశారని విమర్శించారు. అలాగే రాజ్యసభ టికెట్ ను దళితులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ చంద్రబాబు, జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని.. చంద్రబాబు ఇకనైనా ఈ కుల రాజకీయాలు మానుకోవాలని ఆమె సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు క్యాష్ ముఖ్యమని భావించిన చంద్రబాబు… ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారు. రాజ్యసభ సీటును గెలిచే అవకాశం ఉంటే క్యాష్ ను చూస్తారని … లేనప్పుడు క్యాస్ట్ ను చూస్తారని దుయ్యబట్టారు. ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చి దళితులకు న్యాయం చేసిన ఏకైక వ్యక్తి  సీఎం జగన్ అని ఆమె తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news