బాబుపై మ‌హాకుట్ర‌ : ఎమ్మెల్సీ బుద్దా

-

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మహాకుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. కుట్రకు ప్రధాని మోదీ అధ్యక్షుడని, కేసీఆర్‌, జగన్‌, పవన్‌ సభ్యులని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్నటి వరకు చంద్రబాబుకు కేసీఆర్‌, కేటీఆర్‌ సపోర్ట్‌ చేయలేదా? అని ప్రశ్నించారు. మోదీ మోచేయి నీళ్లు తాగుతూ కేసీఆర్‌ మాట మార్చారని బుద్దా వెంకన్న తీర్రస్థాయిలో విమర్శించారు. కేసీఆర్‌ చరిత్ర ఏంటో అందరికీ తెలుసునని, కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని అన్నారు. కేసీఆర్‌ ఒక మురికికాల్వ అని, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వెంకన్న విమర్శించారు. ఇప్పటికైనా మోదీ గ్యాంగ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ఏపీలో పరిణామాలపై తెలుగు ప్రజలంతా ఏకం కావాలని బుద్దా వెంకన్న పిలుపు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version