టీడీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్సి, నేను వైఎస్ అభిమానిని…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లు ఏమో గాని విపక్ష తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సొంత పార్టీ నేతలను కాపాడుకోవడం ఇబ్బందికరంగా మారింది. నమ్మకంగా ఉన్నారని పదవులు ఇచ్చిన చంద్రబాబుకి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు ఎమ్మెల్సీలు. రాజధాని బిల్లుని అడ్డుకోవడానికి తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలను వాడుతున్న చంద్రబాబుకి ఇప్పుడు కొందరి తీరు చుక్కలు చూపిస్తుంది.

నమ్మకమైన నేతలుగా ఉన్న వాళ్ళలో చాలా మంది ఇప్పుడు అధికార పార్టీకి జైకొట్టే యోచనాలో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళను బుజ్జగించడానికి గాను అన్ని విధాలుగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో శివనాథ్ రెడ్డి అనే ఎమ్మెల్సీ చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. ఆయన పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. తాను వైఎస్ కుటుంబానికి అభిమానిని అని చెప్పారు.

తనను ఎవరూ ప్రలోభ పెట్టలేదని చెప్పిన ఆయన తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేద్దాం అనుకుంటే చంద్రబాబు పిలిచి తెలుగుదేశం నుంచి అవకాశం ఇచ్చారని చెప్పడం ఇప్పుడు టీడీపీ వర్గాలను షాక్ కి గురి చేసింది. తాను వైసీపీలో ఉంటాను అని ఆయన స్పష్టం చేసారు. దీనితో ఆయన వెంట మరికొందరు ఎమ్మెల్సీలు వెళ్ళే అవకాశం ఉందని టీడీపీ వర్గాలే అనడంతో ఇప్పుడు చంద్రబాబుకి పాలుపోవడం లేదట.

Read more RELATED
Recommended to you

Latest news