మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు టీడీపీ నీళ్లొదిలింది.. తెలుగులో మోదీ ట్వీట్లు

-

ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ఆయన ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తెలుగులో చేసిన ట్వీట్లు రాజకీయంగా సంచలనం సృష్టించాయి.

Modi tweeted in telugu ahead of his telugu states election campaign

ఈసాయంత్రం నేను కర్నూలులో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి, మోసపూరిత తెలుగుదేశం పాలనలో ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, బలహీనమైన పరిపాలనతో అన్ని రంగాల్లో తిరోగమనంలో ఉంది. యువత కలలు నెరవేర్చడానికి నేను ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను.
భారత ప్రజలంతా ఎన్డీయే మిత్రపక్షాలను తిరిగి మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో, ఆశీర్వదించాలో నేను మీకు వివరించదలచుకున్నాను.

మహబూబ్ నగర్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలను నేటి బహిరంగ సభలో పాల్గొనమని నేను ఆహ్వానిస్తున్నాను.. అంటూ మోదీ మూడు ట్వీట్లు తెలుగులో చేశారు.

ఆయన ఇవాళ ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని మహబూబ్ నగర్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈసందర్భంగా ఆయన ఈ ట్వీట్లు చేశారు. ఏపీలో చంద్రబాబునాయుడును విమర్శిస్తూ… కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందించిన సాయంపై ప్రధాని ప్రసంగించనున్నారు. చంద్రబాబు.. కేంద్రప్రభుత్వం వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదని విమర్శిస్తుండగా… కేంద్ర ప్రభుత్వం ఏపీ కోసం ఏంఏం చేసిందో ప్రధాని మోదీ ఇవాళ కర్నూలు సభలో వివరించనున్నారు. దీంతో మోదీ కర్నూలు సభలో ఏం ప్రసంగించనున్నారో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news