రాజధాని రైతులకు మీ సానుభూతి అవసరం లేదు : వైసీపీ ఎంపీ

-

మహిళా రైతులు కాళ్లు కందిపోయి పాదయాత్ర చేస్తున్నారని, వారికి మంత్రుల సానుభూతి అక్కరలేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. కన్నూమిన్నూ కానకుండా మాట్లాడటం మానుకోవాలని సూచించారు. మహిళా రైతుల బొబ్బలెక్కిన పాదాలను స్పృశించి క్షమాపణలు కోరినా మంత్రుల పాపానికి పరిహారం లేదన్నారు.

‘మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే రుషికొండలో ముఖ్యమంత్రి నివాస సముదాయం, కార్యాలయ భవనాలు నిర్మిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన దానికంటే పది రెట్లు పెద్ద భవనాలను రుషికొండపై నిర్మిస్తున్నారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ బృందం నివేదికను బహిర్గతం చేయాలి. రూ.వేల కోట్ల విలువ చేసే వేల ఎకరాల భూములను కొల్లగొట్టినందునే విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. విశాఖలో రాణి ఆస్తి 15 ఎకరాల భూమిని గతంలో ఆమెతో ఒప్పందం చేసుకున్న వారికి కాకుండా ఇతరులకు ఆ భూమి దక్కడం పరిశీలిస్తే దీని వెనక ఉన్న మతలబు ఏమిటో తెలిసిపోతోంది..’ అని రఘురామ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news