అవి పోలీస్ స్టేషన్లా? లేక వైకాపా నాయకుల ఫ్యాక్షన్ డెన్లా.?

-

ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. దళితులపై జగన్ రెడ్డి గారి దమనకాండ పరాకాష్టకు చేరింది అని మండిపడ్డారు. విచారణ అని పిలిచి విజయవాడ, కృష్ణలంక కు చెందిన దళిత యువకుడు అజయ్ ని కొట్టి చంపేశారని ఆవేదన వ్యక్తం చేసారు. అనారోగ్యంతో చనిపోయాడని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

lokesh
lokesh

వాస్తవాలు బయట పడతాయనే భయంతో కుటుంబ సభ్యులు నోరువిప్పడానికి లేదని బెదిరించారని మండిపడ్డారు. దుర్గ గుడి సభ్యురాలి కుమారుడికో న్యాయం, దళిత యువకుడికి ఒక న్యాయమా? మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపారని, ఇసుక అక్రమ రవాణాకి అడ్డొచ్చాడని వరప్రసాద్ కి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేసారని ఆయన విమర్శించారు. ఇప్పుడు విచారణ పేరుతో అజయ్ ని బలితీసుకున్నారు. అవి పోలీస్ స్టేషన్లా? లేక వైకాపా నాయకుల ఫ్యాక్షన్ డెన్లా.? అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news