బెంజ్ మినిస్టర్ వీడియో పోస్ట్ చేసిన లోకేష్…!

-

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి గుమ్మనూరు జయరాం పై విపక్షాలు చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఆయన టార్గెట్ గా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ… మంత్రి కుమారుడు ఈశ్వర్ కి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చారు అని ఫోటోలు బయటపెట్టారు. దీనిపై నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. బెంజ్ మినిస్టర్ జయరామ్ గారే ఈ ఎస్ ఐ స్కామ్ వెనుక ఉన్న అసలైన సూత్రదారి అని ఆరోపించారు.

పనులు లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కార్మిక శాఖ మంత్రి జయరామ్ మాత్రం ఈఎస్ఐ స్కామ్ లో నిందితుడు ఇచ్చిన బెంజ్ కార్ లో విలాసంగా తిరుగుతున్నారని ఆరోపించారు. అయితే మంత్రి స్పందిస్తూ కారు నాది తమది కాదని ఎవరో కారు పక్కన ఫోటో దిగితే కారు తమది అవుతుందా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news