వస్తే పీసీసీ లేకపోతే కొత్త పార్టీ ? రేవంత్ స్కెచ్ ?

-

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయానికి వచ్చింది అనేది స్పష్టంగా తేలకపోవడంతో ఆశావాహులు అధిష్టానం దృష్టిలో పడేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తూ, తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని పిసిసి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు పార్టీ సీనియర్ నాయకులు అంతా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతున్నా, 2014 నుంచి వరుసగా అన్ని ఎన్నికల్లోనూ చేదు ఫలితాలే దక్కించుకుంటూ వస్తుండడం వంటి వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్నా, నాయకులు మాత్రం పిసిసి అధ్యక్ష పదవిని తామే దక్కించుకోవాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ,ప్రధానంగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి – రేవంత్ రెడ్డి మధ్య పిసిసి అధ్యక్ష పదవి విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది.

ఎవరికి పదవి అనే విషయం పై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వి.హనుమంతరావు, తూర్పు జగ్గారెడ్డి, ఇలా చాలా మంది పి సి సి పదవిని ఆశిస్తున్నారు. అయితే రేవంత్ కు తప్ప తమలో ఎవరికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినా ఫర్వాలేదు అన్నట్లుగా అధిష్టానం వద్ద మెలిక పెడుతున్నారట. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నా, సీనియర్ నాయకులు పార్టీ మారిపోతారు అనే భయం అధిష్టానం పెద్దల్లో ఉంది. ఇది ఇలా ఉంటే పిసిసి పీఠం దక్కకపోతే రేవంత్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద తెలంగాణ కు సంబంధించి ఒక కొత్త పార్టీ సైతం రిజిస్టర్ అయినట్లు సమాచారం. వీటి వివరాలు ఇంకా బయటకు రాలేదు.

పిసిసి పీఠం పై క్లారిటీ వచ్చిన తర్వాత రేవంత్ కు పదవి దక్కకపోతే, కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చు అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే రేవంత్ కు కనుక పదవి ఇస్తే , సీనియర్ నాయకు లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , వి. హనుమంతరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి , శ్రీధర్ బాబు ఇలా చాలా మంది కాంగ్రెస్ ను వీడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో, కాంగ్రెస్ అధిష్టానం టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా ఇది పెద్ద తలనొప్పి వ్యవహారమే.

Read more RELATED
Recommended to you

Latest news