కన్నబాబు, అంబటికి‌ షాకిచ్చిన హెరిటేజ్

-

హెరిటేజ్ కేసులో కన్నబాబు, అంబటి రాంబాబులకు  కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ రోజు ఈ కేసుకి సంబంధించిన విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది.ఈ నేపథ్యంలో వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో వచ్చే వాయిదాకు రావాల్సిందేనని కోర్టు పేర్కొంటూ ఈ మేరకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

గతంలో చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, అంబటి రాంబాబు తప్పుడు ఆరోపణలు చేసి తమ పరువుకు భంగం వాటిల్లేలా చేశారంటూ ఆ కంపెనీ వారిద్దరి పై పరువు నష్టం దావా వేసింది. ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా విచారణకు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించినా ఇద్దరూ పట్టించుకోలేదు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో రెండువైపుల వారు గైర్హాజరైతే కేసులు విచారణ ముందుకెళ్లడం కష్టమన్నారు న్యాయమూర్తి.

Read more RELATED
Recommended to you

Latest news