పవన్ ఢిల్లీ వెళ్తే గాని వీళ్ళకు క్లారిటీ రాదు…!

-

తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. అయితే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ఒక విషయంలో స్పష్టత తెచ్చుకొనే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన కొన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నా సరే పవన్ కళ్యాణ్ ముందుకు రావడం లేదు. ఇక జనసేన పార్టీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో సహకరించే ప్రయత్నం చేయటం లేదు. కృష్ణ, గుంటూరు జిల్లాల మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి నేరుగానే విమర్శలు చేశారు.

ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ బిజెపి తరఫున తిరుపతిలో ప్రచారం చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి బీజేపీ ఎలాగో సహకరించలేదు. కాబట్టి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన సైలెంట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి దీనిపై ఒక స్పష్టత జనసేన పార్టీ నేతలకు ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news