అమర ప్రేమికులు..50 ఏళ్ల వయస్సులో ప్రేమజంట ఆత్మహత్య..

-

కర్నూలు జిల్లా శ్రీశైలంలో దారుణం చోటు చేసుకుంది. శ్రీశైలంలో ఓ ప్రేమ జంట ఆత్మ హత్య చేసుకుంది. నీలం సంజీవరెడ్డి సత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది ఈ ప్రేమ జంట. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఇసప్పాలెం కు చెందిన నాగలక్ష్మి (48) మృతి భర్త, వెంకట కాళేశ్వర రావు (50) గా గుర్తించారు పోలీసులు.

ఆత్మహత్యా యత్నం చేసిన వారినే సున్నిపెంట ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా దారి లోనే మృతి చెందారు. ఇద్దరికీ వేరే వారితో వివాహం కాగా పెళ్లి కాక ముందు ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే వేర్వేరు వారితో పెళ్లయిన తరువాత విడిపోయింది ఈ ప్రేమ జంట. ఈ మధ్య నే ఇద్దరు కాంటాక్ట్ లోకి వచ్చారు. ఇక ఈ నేపథ్యం లోనే కలసి జీవించ లేమని ఆత్మహత్యకు పాల్పడ్డారు నాగలక్ష్మి , వెంకట కాళేశ్వర్ రావు. ఇక ఈ ఆత్మహత్య పై బంధువులకు సమాచారమిచ్చారు పోలీసులు

Read more RELATED
Recommended to you

Latest news