టీఆర్ఎస్ పార్టీలో అలజడి, కీలక నేత రాజీనామా…!

-

తెలంగాణా అధికార పార్టీలో ఇప్పుడు హైదరాబాద్ లో ముసలం రేగింది. ఆ పార్టీలో తారా స్థాయికి చేరుకున్నాయి కంటోన్మెంట్ బోర్డు సభ్యుల విభేదాలు. టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ. బోర్డు సభ్యులతో విభేదాలే కారణమని తెలిపిన రామకృష్ణ… తాను పార్టీలో ఉండాలని అనుకోవడం లేదని స్పష్టం చేసారు. ఇక బోర్డు ఉపాధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేయాలని సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుంది.

TELANGANA RASHTRA SAMITI amblem

రాజీనామా పత్రాన్ని వర్కింగ్ కేటీఆర్ కు పంపిన రామకృష్ణ… తనకు ఇన్ని రోజులు అవకాశాలు ఇచ్చినందుకు గానూ ధన్యవాదాలు చెప్పారు. దీనిపై తెరాస అధిష్టానం వివరాలు అడిగి తెలుసుకుంది. ఒక మంత్రి వీరి మధ్య రాజీ చేసే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఈ విభేదాలకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news